మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

0
12

మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండోరోజు కూడా మంత్రి నారా లోకేష్ 6 గంటలపాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు. రెండోరోజున ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలవరకు 6గంటలపాటు సికె కన్వెన్షన్ వేదికపై నుంచి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలిరోజున 1331మందికి, రెండోరోజున 1303మందికి మొత్తంగా 2,634మందికి నూతన వస్త్రాలు పెట్టి పట్టాలు అందించారు. మలివిడతలో మంత్రి లోకేష్ అందజేసిన పట్టాల మార్కెట్ విలువ సుమారు రూ.1000 కోట్లుగా ఉంది. రెండోరోజు కూడా ఓపికగా నిలబడి పట్టాలు అందించిన లోకేష్... పలువురు దివ్యాంగ లబ్ధిదారులకు వేదిక కిందకు దిగి వెళ్లి పట్టాలను అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి లబ్ధిదారు, వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. తొలివిడత గత ఏడాది ఏప్రిల్ నెలలో 3,003 మందికి పట్టాలు అందజేశారు. 2029లోగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసముంటున్న ప్రతి లబ్ధిదారుడికి పట్టాలు అందజేస్తానని గత ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, దేవాదాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి, శాఖలవారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. కేంద్రప్రభుత్వంతో ముడిపడివున్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వాటిపై కూడా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
M. S. Manivannan, IAS: Driving Assam's Development Vision
The Journey Begins "The true measure of governance is not in policies drafted, but in the lives...
By Fathima Safa 2026-07-22 13:16:46 0 28
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు
*తాడేపల్లి*   *మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని...
By Rajini Kumari 2026-01-28 13:07:52 0 194
Telangana
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు  ...
By Pinnehasan Odela 2026-01-10 11:26:59 0 204
Andhra Pradesh
మదనపల్లి: రూ. 18, 013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం.
మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో 2026-27...
By Pagadala Venkateswar 2026-06-10 05:25:05 0 62
Manipur
Echoes for Peace: Catholic Bodies Appeal for Harmony
Amidst a fresh wave of violence, Catholic lay organizations in the Archdiocese of Imphal issued a...
By Dunna Jessicaruth 2026-05-15 10:25:55 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com