మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

0
13

మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండోరోజు కూడా మంత్రి నారా లోకేష్ 6 గంటలపాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు. రెండోరోజున ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలవరకు 6గంటలపాటు సికె కన్వెన్షన్ వేదికపై నుంచి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలిరోజున 1331మందికి, రెండోరోజున 1303మందికి మొత్తంగా 2,634మందికి నూతన వస్త్రాలు పెట్టి పట్టాలు అందించారు. మలివిడతలో మంత్రి లోకేష్ అందజేసిన పట్టాల మార్కెట్ విలువ సుమారు రూ.1000 కోట్లుగా ఉంది. రెండోరోజు కూడా ఓపికగా నిలబడి పట్టాలు అందించిన లోకేష్... పలువురు దివ్యాంగ లబ్ధిదారులకు వేదిక కిందకు దిగి వెళ్లి పట్టాలను అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి లబ్ధిదారు, వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. తొలివిడత గత ఏడాది ఏప్రిల్ నెలలో 3,003 మందికి పట్టాలు అందజేశారు. 2029లోగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసముంటున్న ప్రతి లబ్ధిదారుడికి పట్టాలు అందజేస్తానని గత ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, దేవాదాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి, శాఖలవారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. కేంద్రప్రభుత్వంతో ముడిపడివున్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వాటిపై కూడా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు.

Search
Categories
Read More
Telangana
గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు...
By Jagadeesh Babu 2026-05-30 17:05:29 0 263
BMA
BMA
Your Voice. Your Network. Your Future.Bharat Media AssociationAnchor, News Reader, Reporter,...
By Bharat Aawaz 2025-06-05 07:57:51 0 2K
Meghalaya
Banks Closed in Meghalaya on July 17 for U Tirot Sing’s Death Anniversary
On July 17, 2025, banks across Meghalaya—including SBI branches—remained closed to...
By Bharat Aawaz 2025-07-17 07:00:50 0 1K
Andhra Pradesh
చీరాలలో యువకుడి హత్య..! తలకు తీవ్ర గాయం, మెడ చుట్టూ కత్తిపోట్లు
చీరాల:  చీరాల పట్టణంలోని ఆర్ఓబి క్రింద గుర్తు తెలియని యువకుడు మృతదేహం స్థానికులను...
By Gadiyapudi Narendra 2026-01-28 12:06:06 0 224
Andhra Pradesh
విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి !!
కర్నూలు :  కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూల్స్...
By Hari Krishna 2025-12-28 08:46:52 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com