Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.

0
16

మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.

 

మేధావులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రి తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో మదనపల్లె, గుంటూరు (రాజేంద్రనగర్), నెల్లూరు జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

 

ప్రవేశాల్లో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, మిగిలిన 25 శాతం సీట్లు ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ప్రకటన   విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు...
By Rajini Kumari 2026-01-22 12:27:23 0 211
Andhra Pradesh
పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు
చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర...
By Kothuru Murali 2026-06-20 16:21:34 0 69
Andhra Pradesh
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల.
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల 17-03-2026...
By Pagadala Venkateswar 2026-03-17 12:51:22 0 161
Andhra Pradesh
రోడ్లు శుభ్రంగా ఉండాలి: బొబ్బిలి కమిషనర్
బొబ్బిలి పట్టణంలో మురుగునీటి కాలువల పూడికలు తీసి శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి...
By Boiena Rajesh 2026-06-18 05:13:21 0 138
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా...
By Ratna Sekhar 2026-02-28 19:12:00 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com