నీట్ పేపర్ లీకేజీపై PDSU ఆగ్రహం విద్యాశాఖ మంత్రి రాజీనామాకు, విద్యాసంస్థల బంద్‌కు డిమాండ్

0
36

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్, జూలై 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై Progressive Democratic Students Union (PDSU) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని, వరుస లీకేజీలకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంస్థను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశ రాజధానిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, మేధావులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు Sk. అయ్యూబ్ ఖాన్, ఆసిఫాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు సమీర్, తరుణ్, సంఘం నాయకులు శివ శంకర్, శ్రీకాంత్, రిజ్వాన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Gujarat
Tragedy in Bharuch: Mall Wall Collapse Claims Two Lives
A devastating incident occurred in Bharuch today as a shopping mall’s compound wall...
By Lokeshwari Panthadi 2026-07-01 06:18:17 0 53
Mizoram
Mizoram Expands Digital Governance and Citizen Services
The Mizoram government is accelerating the adoption of digital governance platforms to enhance...
By Navya Sree 2026-06-26 09:23:30 0 57
Telangana
కరీంనగర్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
కరీంనగర్ జిల్లా భారత్ అవార్డ్ న్యూస్. కరీంనగర్ జిల్లా కు చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి...
By Thalakokkula Sadanandam 2026-06-13 11:51:36 0 190
Andhra Pradesh
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-13 04:41:48 0 220
Telangana
"వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|
హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక...
By Sidhu Maroju 2026-04-30 05:47:30 0 398
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com