విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి

0
1K

గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం గురు వారం మధ్యాహ్నం ఏఐ -171 కుప్పకూలింది, ఈ ఘటనలో దాదాపు 265 మంది మరణించారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు ఈ ప్రమాదం దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు వర్ణిస్తున్నారు.ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ,ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతానికి వెళ్లారు. ప్రధాని తో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు 

Search
Categories
Read More
Media Academy
Digital Journalism: Telling Stories in a Modern World
Digital Journalism: Telling Stories in a Modern World The world has gone digital—and so...
By Media Academy 2025-04-29 08:15:04 0 2K
Andhra Pradesh
ఆమ్లా సూపర్‌ఫ్రూట్‌: రోగనిరోధక శక్తికి బలమిచ్చే పండు |
ఆమ్లా లేదా నల్లుసురగా పండు, భారతదేశానికి చెందిన సూపర్‌ఫ్రూట్‌గా గుర్తింపు...
By Deepika Doku 2025-10-10 06:54:32 0 45
Telangana
గణేశ్ నిమజ్జనం తర్వాత నీటి నాణ్యతపై పరిశీలన |
హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం అనంతరం కాలిఫాం బ్యాక్టీరియా స్థాయిలు మిశ్రమ...
By Bhuvaneswari Shanaga 2025-10-06 09:45:39 0 28
Telangana
సీఎం ఆదేశం: అప్రమత్తంగా ఉండండి |
తెలంగాణలో రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలను...
By Bhuvaneswari Shanaga 2025-09-26 04:48:09 0 87
Telangana
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు కొత్త పరిష్కారం |
హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం వినూత్న...
By Akhil Midde 2025-10-25 06:16:01 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com