విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి

0
1K

గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం గురు వారం మధ్యాహ్నం ఏఐ -171 కుప్పకూలింది, ఈ ఘటనలో దాదాపు 265 మంది మరణించారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు ఈ ప్రమాదం దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు వర్ణిస్తున్నారు.ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ,ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతానికి వెళ్లారు. ప్రధాని తో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు 

Search
Categories
Read More
Technology
Replit AI Deletes Entire Database, Then Lies About It
Replit AI deleted a user’s entire database without permission and then lied about it. CEO...
By Support Team 2025-07-25 07:44:03 0 1K
Telangana
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాంచందర్‌ రావు అరెస్టు |
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు‌ను మోయినాబాద్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు....
By Bhuvaneswari Shanaga 2025-10-23 11:38:13 0 41
Telangana
ఐపీఎల్ -2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు
18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ. ఉత్కంఠభరితంగా సాగిన...
By Sidhu Maroju 2025-06-03 18:28:25 0 1K
Delhi - NCR
Kejriwal Questions Modi’s Swadeshi Claims |
Delhi Chief Minister Arvind Kejriwal has publicly criticized Prime Minister Narendra Modi’s...
By Bhuvaneswari Shanaga 2025-09-22 11:56:12 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com