"SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|
● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం.
● ప్రతి కుటుంబాన్ని కలిసి ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణపై అవగాహన.
● మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక నాయకుల భాగస్వామ్యం.
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కలిసి ఎన్యూమరేషన్ ఫారం అందిందా, గడువులోపు సమర్పించారా అనే విషయాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫారాలను పూర్తి చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
ఫారం నింపడంలో లేదా సమర్పణ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక కార్యకర్తల సహాయాన్ని తీసుకోవాలని కోరారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి కుటుంబం సహకారం అవసరమని వివరించారు.
ఈ కార్యక్రమంలో, అరుణ్, లింగారెడ్డి, ప్రశాంత్, ప్రేమ్, సాజిద్, యాదగిరి, అంజయ్య, రాజు, మనీష్ తదితరులు పాల్గొని ప్రజలకు అవసరమైన సహకారం అందించారు.
#Sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz