హిందూ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా మారుస్తా: ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
119

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బోయిన్ పల్లి చిన్న తోకట్ట లోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని GM అంజయ్య శ్మశాన వాటిక సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కలిసి వినతిపత్రం అందజేశారు.

 తనను కలిసిన స్మశాన వాటిక సంక్షేమ సంఘం సభ్యులతో స్మశాన వాటిక అభివృద్ధి గురించి చర్చించి ఈ స్మశాన వాటికను నియోజకవర్గం లోనే మోడల్ స్మశాన వాటికగా అభివృద్ధి చేద్దామని, దానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

 మొదటి విడతగా ఎమ్మెల్యే నిధుల నుంచి 50 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని, ఈ నిధుల ద్వారా స్మశానవాటికలో దహన వాటికలు, పురుషులు, స్త్రీలు దుస్తులు మార్చుకొనే గదులు, మంచినీటి సదుపాయం తదితర ఏర్పాట్లను చేసుకుందామని, ఈ నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు కేటాయిస్తానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నాకు మీరందరూ సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైనా తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేను కలిసిన వారిలో స్మశాన వాటిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండల్ యాదవ్, ఉపాధ్యక్షులు సదానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతి గౌడ్, అశోక్, యాదవరావు, రామారావు తదితరులు ఉన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-03-02 10:28:55 0 86
Andhra Pradesh
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో...
By John Baji 2025-12-25 06:16:18 0 151
Andhra Pradesh
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతు
కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం...
By Ratna Sekhar 2026-03-10 14:46:00 0 291
Andhra Pradesh
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-12 11:10:36 0 210
Manipur
Authorities Seize 86 Arms and Nearly 974 Ammunition Rounds in Crackdown
In a coordinated multi-district operation, security forces have recovered 86 weapons and...
By Bharat Aawaz 2025-07-17 08:21:28 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com