విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ

0
65

మహబూబాబాద్,
మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన డిజిటల్ విద్యను అందుకునేందుకు ఈ స్మార్ట్ టీవీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్య పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పాఠశాలకు స్మార్ట్ టీవీని అందించిన శ్రీ బండి శ్రీనివాస్ సేవాభావం, దాతృత్వాన్ని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, శంకర్, సాయికుమార్, శిరీష పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన
పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన...
By Kothuru Murali 2026-04-19 11:26:12 0 100
Telangana
నిజామాబాద్
ఈరోజు 36వ డివిజన్లో చేపట్టినటువంటి 6 బూతుల SIR ప్రక్రియలో, ఏనుమరేషన్ ఫామ్స్ వితరణ మరియు నింపిన...
By Sadaq Sadaq 2026-07-11 02:19:14 0 95
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
*విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు*    ఘాట్ రోడ్డు, మహా...
By Rajini Kumari 2025-12-26 10:07:04 0 213
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ!!
కర్నూలు : కర్నూలు జిల్లా...* రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... *...
By Hari Krishna 2025-12-26 00:23:29 0 204
Business & Finance
Build Your Public Limited Company in India
Register your Public Limited Company in India with expert guidance and a seamless online process....
By Navya Sree 2026-07-08 13:03:05 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com