రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ

0
63

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ మరియు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని మాట్లాడారు. దేశంలో నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ శాంతియుత నిరసన ర్యాలీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, వాంకిడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా తో పాటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా మండల స్థాయి నాయకులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని నిరసనను విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-07 00:56:04 0 165
Andhra Pradesh
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...
By Benguluri Madhubabu 2026-03-11 05:17:09 0 185
Andhra Pradesh
పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం
పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం! దర్శి మండలం...
By Chennaiah Kati 2026-07-04 14:37:02 1 68
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-03-31 00:09:20 0 201
Andhra Pradesh
డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్
విజయవాడ    *డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్*  ...
By Rajini Kumari 2026-04-24 13:13:08 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com