ప్రతి పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చడమే నా లక్ష్యం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
1K

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ లో మడ్ ఫోర్డ్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో ఏర్పాటుచేయనున్న మోడల్ కాలని ఏర్పాటు కోసం ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్థలపరిశీలనకు సంబంధించి తిరుమలగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో రేపటి నుండి సర్వే చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కంటోన్మెంట్ లో మోడల్ కాలనీ నిర్మాణం కోసం మొత్తం 18 బస్తీలలో ఈ సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్ల కోసం రేపటి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో వారి వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇండ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని సంబంధిత అధికారులతో చర్చలు కూడా సానుకూలంగా జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో రసూల్ పురా లో నారాయణ జోపిడి లో రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి నిర్మాణం జరుగుతుండగానే లక్కీ డ్రా ని కూడా నిర్వహించి ఇండ్ల కేటాయింపు జరుపుతామని, లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణ నాణ్యత తామే పర్యవేక్షించుకునే వీలు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పేద ప్రజలకు సొంత ఇండ్ల పట్టాలు ఇవ్వలేని దుస్థితిలో గత ప్రభుత్వాలు ఉండేవని ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పేదలకు న్యాయం చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు, బస్తీల ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి
వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26...
By Vadlamudi NagaVenkat 2026-04-20 04:49:46 0 235
Business & Finance
Start an LLP with the Right Legal Registration
A Limited Liability Partnership (LLP) combines the flexibility of a partnership with the legal...
By Navya Sree 2026-07-13 07:40:43 0 58
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
By BABJI DADALA 2026-02-09 09:24:22 0 499
Andhra Pradesh
ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి...
By Gadiyapudi Narendra 2026-03-26 17:14:18 0 402
Telangana
మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్
వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్  పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి...
By CM_ Krishna 2025-12-28 06:03:41 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com