గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
78

మంచిర్యాల జిల్లా :  దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తమ తాత కాకా వెంకటస్వామి ఈ ట్రస్ట్‌ను స్థాపించారని గుర్తుచేశారు,

గూడెం జడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తనను బాధించిందని, త్వరలోనే ఈ పాఠశాలకు అవసరమైన బెంచీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.కార్యక్రమం అనంతరం ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు,ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, గూడెం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు,రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రజల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు.

అయితే అలాంటి విషయాలను తాను పట్టించుకోనని, ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయడమే తన ఆకాంక్ష అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా: ఆర్ సి వై
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం,...
By Kothuru Murali 2026-06-13 15:58:11 0 72
Andhra Pradesh
ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ – APC అనూరాధ.
అన్నమయ్య జిల్లాలోని ప్రతి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాల 2026–2027 విద్యాసంవత్సరానికి 1వ...
By Pagadala Venkateswar 2026-02-13 06:34:43 0 143
Business & Finance
Grow Smarter with a One Person Company Today
A One Person Company (OPC) is an ideal business structure for solo entrepreneurs who want the...
By Navya Sree 2026-07-18 04:56:43 0 28
Andhra Pradesh
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి....
By Pagadala Venkateswar 2026-03-31 03:25:14 0 141
Andhra Pradesh
సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును...
By Pagadala Venkateswar 2026-02-24 07:36:44 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com