క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|

0
92

"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

కొత్తగా ఓటర్లుగా నమోదు కావాల్సిన వారు, పేర్లు సవరించుకోవాల్సిన వారు, చిరునామా మార్పులు లేదా ఇతర వివరాల సవరణ అవసరమున్న వారు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ ఫారాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. 

ప్రజలు కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

–Sidhumaroju

Search
Categories
Read More
Telangana
నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్  3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి...
By Sidhu Maroju 2025-12-19 07:21:00 0 214
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:27 0 36
Andhra Pradesh
గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి
నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు...
By Patan Khuddus 2026-07-06 16:45:35 0 91
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు సాదర స్వాగతం
తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి ఎమ్మెల్యే బండారు...
By Chennaiah Kati 2026-07-24 07:34:39 0 12
Andhra Pradesh
మదనపల్లె టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా భారతి నాయుడు నియామకం.
మదనపల్లెలో తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ల తర్వాత ఒక మహిళకు కీలక బాధ్యత దక్కింది. గురువారం బైగారి...
By Pagadala Venkateswar 2026-06-19 04:31:26 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com