ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|

0
55

- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం

- లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి.

హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.

అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత కోసం అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు దర్శనం సమయంలో తోపులాటలకు గురికాకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి కళ్యాణానికి సుమారు 20 వేల మంది భక్తులు హాజరయ్యేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 7 నుంచి 8 లక్షలకు చేరుకుందని చెప్పారు. వారానికి లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 86
Telangana
ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు : రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్
మంచిర్యాల నియోజకవర్గం : శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సమావేశంలో ,ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సీఐటీయు...
By Avunoori Mahesh 2026-04-08 11:38:50 0 240
Andhra Pradesh
ఫైబర్ నెట్ కేసు కొట్టివేత విజయవాడ ఏ సి బి కోర్టు తీర్పు
*ఫైబర్ నెట్ కేసు కొట్టివేత...విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు*   *చంద్రబాబుకు క్లీన్ చిట్...ఇతర...
By Rajini Kumari 2025-12-13 09:09:50 0 272
Andhra Pradesh
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*     *అమరావతి*...
By Rajini Kumari 2026-05-08 13:40:56 0 110
SURAKSHA
A.V. Ranganath: The Epitome of Integrity and Courage
A. V. Ranganath: The Epitome of Integrity and Courage A Relentless Guardian of Law and Order in...
By Kalaga Sailaja 2026-07-11 10:55:35 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com