Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.

0
32

Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న భరోసా' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని వారు తెలిపారు.

 

గతంలో అందించిన మొత్తానికి అదనంగా రూ.1,000 పెంచి రూ.25 వేలుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

 

అదేవిధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు (పవర్‌లూమ్‌లకు) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ఈ చర్యలతో ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

Search
Categories
Read More
Manipur
Authorities Seize 86 Arms and Nearly 974 Ammunition Rounds in Crackdown
In a coordinated multi-district operation, security forces have recovered 86 weapons and...
By Bharat Aawaz 2025-07-17 08:21:28 0 1K
Telangana
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...
By Ponnala Srinivasrao 2026-07-09 01:46:55 0 119
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరల పతనం.
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు బుధవారం...
By Pagadala Venkateswar 2026-01-29 05:57:36 0 151
Telangana
వరంగల్ జిల్లా భారీ వర్షం అన్నదాతలు ఆందోళన.....
వరంగల్: భారీ వర్షం.. అన్నదాత ఆందోళన భారత్ అవాజ్ న్యూస్ :9 మే వరంగల్  జిల్లా దుగ్గొండి...
By Gujile Ramu 2026-05-09 15:52:25 0 109
Telangana
మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..! భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-12 10:06:07 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com