Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.

0
33

Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న భరోసా' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని వారు తెలిపారు.

 

గతంలో అందించిన మొత్తానికి అదనంగా రూ.1,000 పెంచి రూ.25 వేలుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

 

అదేవిధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు (పవర్‌లూమ్‌లకు) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ఈ చర్యలతో ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క. ‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
By Ponnala Srinivasrao 2026-06-04 04:59:17 0 98
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్...
By Pagadala Venkateswar 2026-07-01 06:53:33 0 65
Andhra Pradesh
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*Photos :-* అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-20 12:01:46 0 191
SURAKSHA
Vadarevu Vinay Chand IAS: Transforming Governance with Vision
A distinguished Andhra Pradesh cadre IAS officer known for his visionary leadership, efficient...
By Lokeshwari Panthadi 2026-07-16 06:52:04 0 50
Andhra Pradesh
ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-02-07 03:05:38 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com