*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*

0
52

*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ నమోదు ప్రారంభం..* BHARAT AWAZ * సిరిసిల్ల: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే హెచ్-143 ప్రధాన లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా స్పష్టం చేశారు. వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిగత గౌరవాన్ని కాపాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతోందన్నారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుని, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినట్లు గుర్తుచేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సాధన కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమకాలీన సమాజంలో జర్నలిస్టులకు వృత్తిపరమైన సవాళ్లు పెరుగుతున్నాయని, ఇలాంటి తరుణంలో సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ జర్నలిస్టుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 1K
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి విద్యార్థులకు ప్రతిభను సాధించినందుకు పురస్కారాలు అందించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను సాధించినటువంటి వాల్మీకి...
By Boya Dasthagiri 2026-06-07 13:17:20 0 176
Business & Finance
Sensex Opens Higher as Investor Confidence Improves
Mumbai's financial markets opened on a positive note as the Sensex gained in early trading and...
By Navya Sree 2026-07-03 05:31:02 0 27
Mizoram
Lunglei Achieves 107% HPV Vaccination Target Success
Mizoram’s healthcare sector has marked a significant milestone, with the Lunglei district...
By Lokeshwari Panthadi 2026-07-02 06:47:27 0 92
Andhra Pradesh
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ.
మదనపల్లి 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ బుధవారం మదనపల్లిలోని కోటబడి హోప్ మునిసిపల్ ఇంగ్లీష్ మీడియం...
By Pagadala Venkateswar 2026-01-29 06:09:56 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com