సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు
సామాజిక సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తే మన భవిష్యత్తు
ఈరోజు కొండేపి నియోజకవర్గంలో గౌరవ *బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారితో* కలిసి, *గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు* పలు అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సింగరాయకొండలో
రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్డును* ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
టంగుటూరులో
బీసీ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి విద్యాభ్యాసం, వసతి, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.
విద్యార్థులకు *స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ* చేసి, క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని ప్రోత్సహించారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న పలువురు *ఉపాధ్యాయులను మొమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.*
వెనుకబడిన వర్గాల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz