ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్

0
53

ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్

గుంటూరు జిల్లా ప్రజలకు పారదర్శకమైన, ప్రజలకు చేరువైన పోలీసింగ్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం అందిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ తెలిపారు.

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, 197 ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అంశాన్ని పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా విచారించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఫిర్యాదు పరిష్కారమైన అనంతరం తప్పనిసరిగా ఫిర్యాదుదారునికి సమాచారం అందించి, వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు.

ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వకుండా ఏ పిటిషన్‌ను కూడా ముగించకూడదని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఫిర్యాదుల నమోదు, దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియల్లో పోలీస్ సిబ్బంది అవసరమైన సహకారం అందించారు.

అదేవిధంగా, అమ్మ చారిటబుల్ ట్రస్ట్, సాయినగర్, గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, వృద్ధులు, నిరుపేదలకు ఈ సేవ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొంటూ, సమాజ సేవలో భాగస్వామ్యమైన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ జి.వి. రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్, PGRS సీఐ బిలాలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్...
By Kothuru Murali 2026-01-25 11:43:18 0 166
Andhra Pradesh
మదనపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు.
శనివారం మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో రాయల్ వుడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-06-21 07:31:42 0 53
Rajasthan
Rajasthan Expands Renewable Energy and Green Development
Rajasthan continues to reinforce its leadership in renewable energy by expanding large-scale...
By Fathima Safa 2026-07-06 08:31:57 0 104
Andhra Pradesh
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *12-12-2025*   మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
By Rajini Kumari 2025-12-13 10:19:54 0 261
SURAKSHA
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసు దళాలు
 రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో నిన్న పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-27 13:03:54 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com