ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం

0
70

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ వీరభద్ర గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు గఫూర్ ఏఐఎస్ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి షాహిద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల విద్య వరకు అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించక దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వార్డెన్ పోస్టులు భర్తీ కాకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయని డిగ్రీ బీటెక్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్ చేతికి రాక కళాశాల చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్రంలో 6400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండిపోవడం వలన దిక్కుతోచని స్థితిలో విద్యార్థులను నిట్టేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్,డిగ్రీ,పాలిటెక్నికల్ ఐటిఐ. కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని కోరారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను గాలికి వదిలేసి నిధులు కేటాయించక విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు డిపార్ట్మెంట్లను క్లోజ్ చేస్తున్నారని యూనివర్స్ లో టీచింగ్ నాల్ టీచింగ్ పోస్టులు మూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవు తుందని. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకునే కలలు కొంటున్న విద్యార్థులకు జీవో నెంబర్ 77 వలన వారికి ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించకపోవడం చాలా వరకు పీజీ కళాశాలలు మూతపడడం వలన విద్యార్థులు ఉన్నత విద్య కు దూరమవుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అధికారంలోనికి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయడమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు ప్రతాప్, వీరేష్, సలాం భాష, సురేష్, మణి,తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 334
Andhra Pradesh
ఈ రోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలకి ఆకర్షితులై
ఈరోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి...
By Chennaiah Kati 2026-01-25 07:24:14 0 212
SURAKSHA
Gaurav Gupta, IAS: Steering Karnataka Towards Excellence
A visionary civil servant whose strategic leadership, transparent governance, and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-18 10:43:15 0 43
Andhra Pradesh
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ...
By Hari Krishna 2026-01-24 07:44:17 0 532
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com