(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
142

ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సరైన అవగాహన ఉండటం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల జాబితా ప్రతి అర్హుడైన ఓటరిని ప్రతిబింబించేలా ఉండాలంటే ఎన్నికల సంఘం చేపట్టే ప్రతి ప్రక్రియపై ప్రజలు అవగాహన కలిగి ఉండటంతో పాటు బాధ్యతాయుతంగా సహకరించాలని ఆయన కోరారు,ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ, అవసరమైన సవరణలు, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశాలు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు,

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు,ఆ కార్యక్రమంలో ప్రజలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు.

Search
Categories
Read More
Bharat Aawaz
📜 Article 10 – Continuity of Citizenship
What is Article 10 About? Article 10 of the Indian Constitution ensures that once a person has...
By Bharat Aawaz 2025-06-27 07:27:28 0 2K
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:46:09 0 469
Telangana
నిజామాబాద్: పద్మశాలి సంఘం నూతనకమితి ప్రమాణ స్వికారం
నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-22 13:26:46 0 134
SURAKSHA
Gujarat Police Launch Operation Surakshit Cyberspace
The Gujarat Police have launched Operation Surakshit Cyberspace, a critical month-long campaign...
By Lokeshwari Panthadi 2026-07-04 05:51:02 0 61
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com