గోపాల్ నగర్ ప్రధాన రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను: బండి రమేష్

0
84

 

 

హైదరాబాద్, కుక్కట్ పల్లి, గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానుల విజ్ఞప్తి మేరకు శ్రీ బండి రమేష్ గారు ఈరోజు గోపాల్‌నగర్ ప్రధాన రహదారిని సందర్శించి, అక్కడి ప్లాట్ యజమానులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు మాట్లాడుతూ, గోపాల్‌నగర్ లేఅవుట్ 1980లో ఏర్పడిందని, 1981లో ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ఆమోదించబడిన లేఅవుట్‌లో ప్రధాన రహదారి వెడల్పు 40 అడుగులుగా మాత్రమే ఉందని, తమ వద్ద ఉన్న అన్ని రిజిస్టర్డ్ అమ్మకపు పత్రాల్లో (Sale Deeds) కూడా 40 అడుగుల రహదారే నమోదై ఉందని వివరించారు.మూసాపేట నుండి లింగంపల్లి వరకు ఇదే రహదారి అనేక ప్రాంతాల్లో 60 నుండి 80 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉందని, అలాంటప్పుడు గోపాల్‌నగర్ ప్రాంతంలో మాత్రమే 120 అడుగుల రహదారి పేరుతో భూములను సేకరించడం పూర్తిగా అన్యాయమని తెలిపారు.ఈ సమస్య గత 40 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా కొనసాగుతోందని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్ యజమానుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని వారు శ్రీ బండి రమేష్ గారిని కోరారు.

ప్లాట్ యజమానుల వినతిని, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం శ్రీ బండి రమేష్ గారు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యకు వీలైనంత త్వరగా న్యాయమైన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానులు ఈ సందర్భంగా శ్రీ బండి రమేష్ గారికి తమ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి భరోసా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, వినోద్ చావా, శ్రీనివాస్, తిలక్, అనిల్, సుధాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక...
By Kothuru Murali 2026-03-02 03:27:23 0 124
SURAKSHA
Harendhira Prasad, IAS: A Rising Leader in Governance
A Young and Dynamic Administrator Committed to Transparent Governance and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-11 06:35:01 0 142
Andhra Pradesh
'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-05 14:42:13 0 319
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:39 0 124
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవోలు దగ్ధం
*ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవోలు దహనం*   *భోగిమంటల్లో జీవో 590,...
By Rajini Kumari 2026-01-14 12:26:58 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com