నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి.

0
115

నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఎవ‌రికి ఉంది?

‎నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి. ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి క‌నీస అవ‌గాహ‌న లేకుండా ద‌బాయిస్తున్నారు. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది క‌రువు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి అంగీక‌రిస్తున్నారు. గోదావ‌రికి పైనుంచి- అంటే శ్రీ‌రాంసాగ‌ర్ నుంచి వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం లేదు అని కూడా వారికి తెలుసు. 

‎అయినా అదే నోటితో క‌న్నెప‌ల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల బ‌రాజుల‌ను నింపితే అవి కూలిపోతాయి, ఊళ్లు మునుగుతాయి, భ‌ద్రాచ‌లం కొట్టుకుపోతుంది అని భ‌య‌పెడుతున్నారు. చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని విధంగా 20 ల‌క్ష‌ల క్యూసెక్కులకు పైగా వ‌ర‌ద వ‌చ్చిన 2022లోనే ఆ బ‌రాజుల‌కు ఏమీ కాలేదు, భ‌ద్రాచ‌లానికీ ఏమీ కాలేదు. అన్నారం, సుందిళ్ల బ‌రాజుల వ‌ద్ద కొన్ని బుంగలు ప‌డ‌డం, వాటిని గ్రౌటింగ్‌తో మ‌ర‌మ్మ‌తు చేయ‌డం ఎప్పుడో జ‌రిగిపోయింది.  

‎ఆ బ‌రాజుల‌ను కూడా పూర్తిస్థాయిలో నింపాల్సిన ప‌నిలేదు. స‌గం నీటి మ‌ట్టం నింపితే చాలు అటు అన్నారం, ఇటు సుందిళ్ల పంపు హౌజుల‌కు నీరు అందుతుంది. సునాయాసంగా నీటిని ఎల్లంప‌ల్లికి ఎత్తిపోయ‌వ‌చ్చు. ఎత్తిపోత‌ల నీటితో బ‌రాజుల‌పై ఒత్తిడి ప‌డి కూలిపోయే ప్ర‌మాదం ఏమీ లేదు. పైనుంచి పెద్ద మొత్తంలో వ‌ర‌ద వ‌స్తేనే బ‌రాజుల‌పై ఒత్తిడి ప‌డుతుంది. ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎప్పుడో చేసిన ప్రకటనను ఒక సాకుగా చూపెడుతున్నది. బరాజుల్లో అటువంటి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే మరమ్మతు చేయకుండా రెండున్నరేళ్లు ఎందుకు కాలక్షేపం చేసింది? 

‎వాస్త‌వం ఇలా ఉంటే మెద‌డులో గుజ్జు గురించి మాట్లాడ‌డం ఏంబాగుంటుంది? గుజ్జు ఎవ‌రికి ఉన్న‌ట్టు ఎవ‌రికి లేన‌ట్టు? హైదరాబాద్లో ఇప్పటికే నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పుడు నీటిని ఎత్తిపోయ‌క‌పోతే హైద‌రాబాద్ నీటి క‌ష్టాల‌కు, ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల క‌రువు క‌ష్టాల‌కు ముఖ్య‌మంత్రి, నీటిపారుద‌ల మంత్రి ఇద్ద‌రూ బాధ్య‌త వ‌హించ‌వ‌ల‌సి ఉంటుంది.  

‎కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ కాదు. ఎల్లంపల్లి నుంచి బస్వాపురం దాకా నిర్మించిన రిజర్వాయర్లు కూడా అందులో భాగమే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో 60 టీయెంసీల నిల్వ సామర్థ్యం రూపకల్పన చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో 150 టీయెంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. అవి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. రెండున్నరేళ్లు బద్నాం గేముతో కాలక్షేపం చేశారు. ఇక చాలు. మేడిగడ్డ బరాజుకు మరమ్మతు పూర్తిచేయండి. ఈ సమస్యను ఇంకా సాగదీస్తే తెలంగాణ ప్రజలముందు మీరు దోషులుగా మిగులుతారు.

‎ఈ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎప్పుడో చేసిన ప్రకటనను ఒక సాకుగా చూపెడుతున్నది. బరాజుల్లో అటువంటి సమస్య ఉన్నట్టు గుర్తిస్తే మరమ్మతు చేయకుండా రెండున్నరేళ్లు ఎందుకు కాలక్షేపం చేసింది? 

Search
Categories
Read More
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 227
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 124
Andhra Pradesh
రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!
Andhra Chandrababu Naidu Kavali visit schedule నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో...
By Pagadala Venkateswar 2026-05-19 05:38:13 0 88
Business & Finance
Bring Your Social Mission to Life with Section 8
A Section 8 Company is the ideal choice for non-profit organizations working toward charitable,...
By Navya Sree 2026-07-11 06:21:21 0 50
Andhra Pradesh
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం
*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం* గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం *పనులు ఆలస్యం అయ్యే అవకాశం*...
By Rajini Kumari 2026-05-15 11:52:07 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com