బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ మాగంటి గోపీనాథ్ కన్నుమూత

0
2K

మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పని చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఐదు గంటల 45 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఏఐజి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. M గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.మాగంటి గోపినాథ్ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

Search
Categories
Read More
Tamilnadu
"ప్రజల కోసం.. ప్రక్షాళన బాటలో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు...
By Sidhu Maroju 2026-04-25 12:55:59 0 175
Telangana
విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక...
By Bittu Bittu 2026-05-07 10:14:55 0 451
Andhra Pradesh
నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు...
By Pagadala Venkateswar 2026-05-02 04:05:07 0 64
Andhra Pradesh
చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు,...
By Kothuru Murali 2026-05-19 15:17:03 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com