మల్కాజిగిరిలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.|

0
73

"సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 4: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణా సంస్థ మేవెన్ సిలికాన్ అత్యాధునిక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 17 ఏళ్లుగా బెంగళూరులో సెమీకండక్టర్ రంగానికి నాణ్యమైన ఇంజనీర్లను అందిస్తున్న మేవెన్ సిలికాన్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులు, యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) ద్వారా దేశంలో చిప్ డిజైన్, తయారీ రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

సెమీకండక్టర్ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, భారత యువతను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్ ఆర్టిసి బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం
మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్,ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర...
By Chennaiah Kati 2026-06-20 14:33:25 0 81
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-16 18:37:59 0 284
Telangana
సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం
సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకా బారత్ ఆవాజ్  తెలంగాణ కోడంగల్   ...
By Vanmoj Suryamohan 2025-12-22 13:16:17 0 342
Andhra Pradesh
నిమ్మనపల్లి: భూ వివాదం నేపథ్యంలో మహిళపై దాడి.
నిమ్మనపల్లి మండలంలో భూ వివాదం కారణంగా గారబురుజు గ్రామానికి చెందిన నాగరత్న (40) అనే మహిళపై...
By Pagadala Venkateswar 2026-06-12 10:58:27 0 83
Andhra Pradesh
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:35:17 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com