బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.

0
47

బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.

మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దొనకొండ మండలం ఇండస్ట్రియల్ కారిడార్ లో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారి తో కలిసి శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ డి.ఆర్.డి.ఏ అధికారులతో పర్యటించారు.

ఈ సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధికి బీడీఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు చొరవ తీసుకోవడం ఆయనకు ప్రత్యేకంగా దర్శి ప్రాంత ప్రజానీకం తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

బిడిఎల్ రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడునున్నాయని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

వందలాది మంది నిరుద్యోగులకు బీడీఎల్ పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తుంది అన్నారు.

ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం అందించేందుకు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని తొలి అడుగు వేయడం అభినందనీయమన్నారు.

వెంటనే బీడీఎల్ పరిశ్రమకు అవసరమైన భూమిని అందించేందుకు అడ్డంకులు తొలగించి ముందుకు వెళ్లాలన్నారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దొనకొండలో వలసలు నివారించి అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషిని అందరం అభినందించాలన్నారు.

రాబోయే ఐదేళ్లలో దొనకొండ దశ దిశ మార్చే లక్ష్యంగా బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటు జరుగుతుందన్నారు.

ఇందుకు సహకరిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలకు డాక్టర్ లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ.. ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో దొనకొండలో బీడీల్ ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని అందించాలని కోరడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే డి.ఆర్.డి.ఏ అధికారులతో స్థల పరిశీలన చేయడం జరిగిందని వెంటనే స్థలాన్ని వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు . బీడీఎల్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా అనుబంధ పరిశ్రమల ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తద్వారా ఉపాధి జరుగుతుందన్నారు. అందులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి కృషి కూడా ఉందని కలెక్టర్ తెలిపారు. వెంటనే స్థలాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు.

ఈ కార్యక్రమం లో దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, నాగులపాటి శివకోటేశ్వర రావు, కామేపల్లి చెంచయ్య, మోడీ ఆంజనేయులు, రమణ యాదవ్, దొనకొండ మండలం మరియు నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 237
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 310
Andhra Pradesh
రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం,...
By Hari Krishna 2025-12-23 04:33:52 0 183
Andhra Pradesh
అనకాపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రి అనిగాని సత్యప్రసాద్
అనకాపల్లి 5.1.2026   అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో...
By Rajini Kumari 2026-01-05 11:59:06 0 230
SURAKSHA
Y. Kikheto Sema: Driving Nagaland's Development Vision
A distinguished IAS officer of the Nagaland cadre, Shri Y. Kikheto Sema serves as the Principal...
By Lokeshwari Panthadi 2026-07-23 06:50:11 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com