మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

0
1K

*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్​ను లారీ ఢీకొట్టింది._* *_ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు._* *_బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరంతా వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది._* *_మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది._* *_ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు._* *_ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు._* *_మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు._* *_ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు._*

Search
Categories
Read More
Andhra Pradesh
'Palleku Podam' Initiative | 'పల్లెలకు పోదాం' కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో 'పల్లెలకు పోదాం' కార్యక్రమం ద్వారా అధికారులు నేరుగా గ్రామ ప్రజలతో ముఖాముఖీ...
By Rahul Pashikanti 2025-09-10 11:29:53 0 41
Bharat Aawaz
⚖️ When Justice Fails: The Chilling Story of Suresh, the Innocent Villager Jailed for a Crime That Never Happened
In the heart of Karnataka, a terrifying example of justice gone wrong unfolded one that shook...
By Citizen Rights Council 2025-07-07 11:35:05 0 1K
Andhra Pradesh
Machilipatnam–Repalle Rail Line Boost | మచిలీపట్నం–రెప్పల్లే రైలు రూట్
మచిలీపట్నం–రెప్పల్లే రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికార ప్రతినిధులు మరియు స్థానిక ప్రజల...
By Rahul Pashikanti 2025-09-10 08:43:48 0 23
Media Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy Journalism is more than just...
By Media Academy 2025-04-29 04:47:42 0 2K
Telangana
అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్/ హైదరాబాద్.   ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల...
By Sidhu Maroju 2025-08-04 18:01:24 0 583
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com