స్కూల్ బుక్ స్టాల్‌ వద్ద USFI, PDSU, DSFI ఆందోళన

0
182

మహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లోఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బుక్ స్టాల్‌పై USFI, PDSU, DSFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, హాస్టల్ సామగ్రి విక్రయిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోందని నాయకులు ఆరోపించారు.

నిరుపేదలకు సేవలందించే సంస్థ పేరుతో అధిక ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రైమరీ వండర్ కిడ్స్ పాఠశాలను కూడా సీజ్ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళోత్ శాంతికుమార్,PDSU జిల్లా కార్యదర్శి బోనగిరి.మధు,DSFI రాష్ట్ర కార్యదర్శి కె.సాయికుమార్ మాట్లాడుతూ.... నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్రిలియంట్ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదులను విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని నాయకులు ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), మండల విద్యాశాఖ అధికారి (MEO)లకు మూడు గంటల పాటు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని, కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని USFI, PDSU, DSFI నాయకులు స్పష్టం చేశారు.

References

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా అయితే జాగ్రత్త :: కర్నూలు ఇంచార్జి ఎస్పీ
కర్నూలు : కర్నూలు సిటీ కర్నూలు జిల్లా...సంక్రాంతికి ఊరెళ్తున్నారా? .విలువైన వస్తువులు ...
By Hari Krishna 2026-01-07 10:28:49 0 349
Business & Finance
Labor Registration for a Legally Compliant Business
Labor Registration ensures your business complies with employment and labor laws while protecting...
By Navya Sree 2026-07-21 05:36:23 0 19
Andhra Pradesh
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
By Boiena Rajesh 2026-04-04 08:26:01 0 182
Andhra Pradesh
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల...
By Chennaiah Kati 2026-07-17 07:12:42 0 37
Andhra Pradesh
జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న...
By Pagadala Venkateswar 2026-06-08 15:46:35 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com