నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు

0
112

వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ యజమానిని పలువురు సంప్రదిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? ఆ భూమిలో బంగారం ఏమైనా పండుతుందా అంటే అవుననే అంటున్నారు గ్రామస్థులు. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ఈర్యతండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఈ ప్రాంతంలో పూర్వం ఆలయాలున్నాయని.. 1991లో అప్పటి భూ యజమానికి కూడా కొంత బంగారం దొరికిందని, తర్వాత కొన్నేళ్లకు పొలంలో జీతం ఉన్న వ్యక్తికి కూడా దొరికిందని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దేవతామూర్తుల విగ్రహాలు లభించాయన్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని దాన్ని తమకు అందించి న్యాయం చేయాలని తొలుత భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. మరోవైపు కనకం దొరికినట్లు జరుగుతున్న ప్రచారంతో రాత్రి సమయంలో భూమిలో చుట్టు పక్కల గ్రామాల వారు సంచరిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
గోదావరిఖని : మహాత్మ జ్యోతిరావు పూలే 1999 జయంతి వేడుకలు..!
ఈరోజు స్థానిక రాజేష్ టాకీస్ సమీపంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ వేడుకలు ఘనంగా...
By Sunka Santhosh 2026-04-11 06:11:45 0 200
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.
  పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం  Andhra Mrithyunjaya Homam on April...
By Pagadala Venkateswar 2026-04-21 03:34:11 0 104
Andhra Pradesh
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* .
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య*  ఏపీ – మంగళగిరి...
By Chennaiah Kati 2026-02-20 04:56:44 0 245
Telangana
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4...
By Pinnehasan Odela 2026-04-19 15:55:15 0 297
Bihar
One Month of Choudhary Govt: Mega Policy Push Unveiled
Patna: Marking exactly one month since taking the oath of office, Chief Minister Samrat...
By Dunna Jessicaruth 2026-05-16 05:35:23 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com