ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

0
71

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ పరిహారం విడుదల చేసిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మహిళలు, కూటమి నాయకులు, నిర్వాసితులు, అభిమానులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ...

"వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారాన్ని విడుదల చేసి నిర్వాసితుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు కూడా వచ్చే జులై, ఆగస్టు నెలలలో మరో రూ.600 కోట్ల పరిహారం విడుదల చేసి, అందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది.

ప్రతి నిర్వాసిత కుటుంబం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సొంత ఇంటిని నిర్మించుకుని గౌరవప్రదమైన జీవితం ప్రారంభించుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్టులో నీటి విడుదల జరిగి లక్షల ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగు నీరు అందే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుందని తెలిపారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చారిత్రాత్మకమని, నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఎరిక్షన్ బాబు గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సుంకేసుల గ్రామ నిర్వాసితులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సొసైటీ కాలనీలో వివాదం: రీ-బోరును అడ్డుకున్న స్థానికులు.
మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10...
By Pagadala Venkateswar 2026-06-02 04:35:32 0 76
Kerala
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats were issued...
By BMA ADMIN 2025-05-20 05:18:29 0 2K
Andhra Pradesh
ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*   ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 09:28:05 0 181
Telangana
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.   బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
By Sidhu Maroju 2025-07-21 17:07:27 0 1K
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 321
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com