ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

0
72

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ పరిహారం విడుదల చేసిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మహిళలు, కూటమి నాయకులు, నిర్వాసితులు, అభిమానులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ...

"వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారాన్ని విడుదల చేసి నిర్వాసితుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు కూడా వచ్చే జులై, ఆగస్టు నెలలలో మరో రూ.600 కోట్ల పరిహారం విడుదల చేసి, అందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది.

ప్రతి నిర్వాసిత కుటుంబం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సొంత ఇంటిని నిర్మించుకుని గౌరవప్రదమైన జీవితం ప్రారంభించుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్టులో నీటి విడుదల జరిగి లక్షల ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగు నీరు అందే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుందని తెలిపారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చారిత్రాత్మకమని, నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఎరిక్షన్ బాబు గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సుంకేసుల గ్రామ నిర్వాసితులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం...
By Avunoori Mahesh 2026-07-19 01:06:55 0 67
Chandigarh
Going Green: No-Car Wednesdays for Government Employees
In a major push for green living and fuel conservation, the Chandigarh Administration has...
By Dunna Jessicaruth 2026-05-20 06:53:03 0 69
SURAKSHA
D. K. Balaji, IAS: Driving Excellence in Public Administration
A Distinguished Civil Servant Advancing Good Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-11 11:24:55 0 197
Telangana
ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే...
By Sidhu Maroju 2026-01-10 12:33:34 0 211
Andhra Pradesh
యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో
యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మార్కాపురం నూతన కలెక్టరేట్ కు 7...
By Chennaiah Kati 2026-07-12 13:52:04 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com