మల్కాజిగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 321 మందిపై కేసులు. |

0
191

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.

వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 321 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు.

పట్టుబడిన వారిలో అత్యధికంగా 249 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 59 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, 11 మంది ఆటో డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహన చోదకులు ఉన్నారు. వీరి రక్తంలోని ఆల్కహాల్ శాతం (BAC) ఆధారంగా పోలీసులు కేసులను వర్గీకరించారు. ఇందులో 11 మందికి 300 mg కంటే ఎక్కువ ఆల్కహాల్ శాతం నమోదవ్వడం గమనార్హం. పట్టుబడిన వారందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మల్కాజిగిరి డీసీపీ స్పష్టం చేశారు. తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణమైతే, వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద 'హత్య కానే నేరపూరిత నరహత్య' కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

గత వారం (మార్చి 1 నుంచి మార్చి 7 వరకు) నమోదైన కేసుల్లో 228 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వారిలో ఐదుగురికి జైలు శిక్షతో పాటు జరిమానా, 10 మందికి సామాజిక సేవ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన 213 మందికి భారీగా జరిమానా విధించింది. రహదారి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
"కాళేశ్వరం, కరవు"పై ప్రభుత్వాన్ని నిలదీసిన..ఈటల.|
"కన్నెపల్లి నుంచి నీటి తరలింపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచన.. రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం...
By Sidhu Maroju 2026-07-13 11:04:36 0 118
Telangana
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్...
By Sidhu Maroju 2025-12-16 10:17:18 0 236
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజల జీవితాలకు మెరుగు !!
కర్నూలు : తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో...
By Hari Krishna 2025-12-21 09:10:11 0 205
Andhra Pradesh
Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు.
  Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ...
By Pagadala Venkateswar 2026-03-10 08:56:20 0 160
Andhra Pradesh
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు.
టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్...
By Chennaiah Kati 2026-06-20 17:32:33 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com