"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|

0
131

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. 

వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, డప్పుల వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

టపాసులు కాలుస్తూ, భారత్ మాతాకీ జై.. మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆల్వాల్ ప్రాంతాన్ని మార్మోగించారు. మోదీ సభకు వెళ్లే ముందు కార్యకర్తల ఉత్సాహం చూసిన స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చింతల మాణిక్య రెడ్డి మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న నాయకత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది. అందుకే ఆల్వాల్ సర్కిల్ నుంచి స్వచ్ఛందంగా వేలాదిమంది సభకు తరలివచ్చారు.

దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం మోదీజీ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు.

కార్తీక్ గౌడ్, శ్రీనివాస్ వర్మ, శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రవంతి, మహేందర్ రెడ్డి, సుజాత, లక్ష్మణ్, చరణ్, సచిన్, విజయ్, సర్వేశ్వర్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆల్వాల్ సర్కిల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
చాలీచాలని వేతనాలతో విఆర్ఏల ఆవేదన
*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన*   *వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు*  ...
By Rajini Kumari 2025-12-16 11:44:36 0 188
Andhra Pradesh
మదనపల్లిలో మద్యం షాపు వద్ద గొడవ: యువకులపై హత్యాయత్నం.
మదనపల్లి పట్టణంలోని బాలాజీనగర్ మద్యం షాపు వద్ద బుధవారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ...
By Pagadala Venkateswar 2026-02-26 11:16:53 0 102
Telangana
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్ కాగజ్‌నగర్ మండలం ఈస్గాం...
By Pinnehasan Odela 2026-02-02 14:46:03 0 249
Andhra Pradesh
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-08 07:31:28 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com