వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 300 కోట్లు పరిహార అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు

0
70

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

యర్రగొండపాలెం నియోజకవర్గం, దోర్నాల మండలంలోని గంటవానిపల్లెలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించారు.

అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,351 కుటుంబాలకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ (పునరావాసం మరియు పునరుద్ధరణ) పరిహారాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో సీఎం ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి మాట్లాడుతూ...

మన ప్రాంతాన్ని ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది రాజకీయ నాయకులు విస్మరించారు. అయితే 1996లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమృతహస్తాలతో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మాత్రమే ఈ ప్రాజెక్టు పనులు గణనీయమైన పురోగతి సాధించాయి. ఇది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన వాస్తవం.

దురదృష్టవశాత్తూ, గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురై, పనులు మందగించాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చినా, అవి ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. అంతేకాకుండా, పూర్తికాని ప్రాజెక్టును కూడా ప్రజలకు అంకితం చేశామని చెప్పడం ఈ ప్రాంత ప్రజలను నిరాశకు గురిచేసింది.

ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉంచి, రాష్ట్రంలో చారిత్రాత్మకమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి, వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరలోనే ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

1996లో శంకుస్థాపన జరిగిన రోజున నేను స్వయంగా ఇక్కడ ఉన్నాను. అప్పట్లో నేను ఎంపీపీగా పనిచేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టు ప్రయాణాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను.

ఈ ప్రభుత్వం హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తై, ఈ ప్రాంత రైతుల కల సాకారం కావాలని, ప్రతి ఇంటికి తాగునీరు చేరాలని, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
By G k Nookala 2026-03-06 11:14:32 0 135
Bihar
Bihar Expands Renewable Energy for Sustainable Growth
Bihar continues to accelerate the adoption of renewable energy through the expansion of solar...
By Fathima Safa 2026-07-03 14:54:15 0 58
Andhra Pradesh
మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్
🚨🚨 *Big Breaking News 🚨🚨   *పల్నాడు : మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు సీరియస్‌.*...
By Rajini Kumari 2025-12-20 12:45:10 0 188
Andhra Pradesh
రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం
    ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే...
By Patan Khuddus 2026-05-08 10:59:49 0 273
Andhra Pradesh
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్ర‌చుర‌ణార్థం 18-12-2025   ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు...
By Rajini Kumari 2025-12-18 11:13:09 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com