అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|

0
88

"HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ."

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న నీటి ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా సకాలంలో అందడం లేదని అన్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో ప్రైవేట్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రోజువారీ నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రజల దాహం తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అన్నారు.  

ఇంకుడు గుంతల ఏర్పాటుపై నిర్లక్ష్యం, చెరువుల పూడికతీత చేపట్టకపోవడం వల్ల అల్వాల్‌తో పాటు హైదరాబాద్‌లోని అనేక కాలనీల్లో భూగర్భ జలాలు అడుగంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని, HMWSSB ద్వారా నీటి ట్యాంకర్ల సంఖ్యను వెంటనే పెంచాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్ చేశారు. 

కనీసం రెండు రోజులకోసారి ప్రతి ప్రాంతానికి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు సకాలంలో తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
వృద్ధ దంపతుల ఇంటిని కూల్చేశారు – న్యాయం కోసం ఫిర్యాదు.
మదనపల్లె మండలం, పోతబోలు పంచాయతీ, శానిటోరియం సమీపంలోని తురకపల్లెకు చెందిన గఫూర్ ఖాన్, బుడాన్ భీ...
By Pagadala Venkateswar 2026-02-03 06:22:45 0 123
Telangana
నిజామాబాద్
పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేద వారికి ఇళ్ళు ఇవ్వలేని అసమర్థ పాలన నడిచింది,నవిపేట్ ఇందిరమ్మ ఇళ్ల...
By Sadaq Sadaq 2026-06-03 17:46:14 0 110
Andhra Pradesh
రైళ్లల్లో వీళ్ళకి టికెట్ అవసరం లేదు ఫ్రీగా జర్నీ
రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!   రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల...
By Rajini Kumari 2026-06-06 11:23:38 0 213
Telangana
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర...
By Sidhu Maroju 2025-09-27 10:43:26 0 277
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com