జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|

0
90

"జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లో డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి  మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణ హాజరై మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువతతో పాటు ప్రతి పౌరుడు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 

అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు జూబ్లీ బస్ స్టేషన్ పరిసరాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. 

ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మాదకద్రవ్యాలపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొనగా, ఈ కార్యక్రమాన్ని మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్ సమన్వయం చేశారు.

–Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని,...
By John Baji 2025-12-31 09:11:26 0 196
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద...
By Kothuru Murali 2026-06-04 14:39:11 0 84
Andhra Pradesh
భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.
అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తమ ఆవేదన...
By Pagadala Venkateswar 2026-05-20 03:38:25 0 83
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 417
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_    *_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*...
By Rajini Kumari 2026-04-01 08:55:53 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com