నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

0
124

నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించడం జరిగిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు.ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, చిన్న నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు.

*"మన ఓటు – మన హక్కు... మన బాధ్యత. ప్రతి ఓటరిని రక్షించుకుందాం... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం."*

Search
Categories
Read More
Andhra Pradesh
ఉత్తమ కార్యకర్తలను సన్మానించిన కోడుమూరు ఎమ్మెల్యే !!
కర్నూలు : కోడుమూరు :  టీడీపీ  పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు...
By Hari Krishna 2025-12-31 11:12:58 0 214
Telangana
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన,...
By Bheeshman King 2025-12-22 12:59:35 0 304
Andhra Pradesh
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం: ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు; ...కర్మ రిటర్న్-ఎమ్మెల్యే...
By Chennaiah Kati 2026-07-03 09:50:05 0 45
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.
అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల...
By Pagadala Venkateswar 2026-04-30 04:30:32 0 97
Telangana
నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా...జోషిక, శ్వేత, శశి,‎పూజ, అఖిల, పావని
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు...
By Ponnala Srinivasrao 2026-07-22 04:30:07 0 28
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com