ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|

0
121

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 

వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ పేరు జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేయించుకోవాలని కోరారు.

ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో పలు పరిపాలనా, సంక్షేమ అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలు నెల రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, వార్డు-2 కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి...
By Pagadala Venkateswar 2026-07-15 05:20:06 0 43
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 150
Andhra Pradesh
మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:25:51 0 160
Andhra Pradesh
అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు
రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం...
By Benguluri Madhubabu 2026-03-23 03:53:11 0 226
Andhra Pradesh
బాలికపై హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య!
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు....
By Pagadala Venkateswar 2026-02-18 06:44:08 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com