GDCC బ్యాంక్, నల్లపాడు బ్రాంచ్ నందు నిధుల దుర్వినియోగం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా CCS పోలీసులు.

0
303

📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, CCS డీఎస్పీ శ్రీ బి.వి. మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన నిధుల దుర్వినియోగం కేసులో మరో(ఎనిమిదవ) నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది.

📍నల్లపాడు పోలీస్ స్టేషన్ నందు తేది 28.11.2025న నమోదైన కేసులో ముద్దాయి (A-8) అయిన పీటా.వెంకటేశ్వరావు ను తేది.02.02.2026 మధ్యాహ్నం 3.15 గంటలకు గుంటూరు పట్టణంలోని బ్రాడీపేట ప్రాంతంలో ఉన్న GDCC బ్యాంక్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

📍కేసు పూర్వాపరాలు: నల్లపాడు GDCC బ్యాంక్ నందు అప్పట్లో మేనేజర్‌గా పనిచేసిన దేవరకొండ అరుణ కుమారి, అప్పటి CEO తొర్లికొండ కృష్ణవేణి, అప్పటి బ్యాంక్ చైర్‌పర్సన్ రాతంశెట్టి. సీతారామాంజనేయులు @ లాల్పురం రాము మరియు అప్పటి కమిటీ సభ్యులు యర్రంశెట్టి ఈశ్వర్ ప్రసాద్, నల్లపాటి రామయ్య, కోటా హరిబాబు, వట్టికొండ కోటేశ్వరమ్మ, దూమావత్ గోవింద నాయక్, వేలిసెల ఏడుకొండలు, కూనిసెట్టి శివ నవీన్, పీటా వెంకటేశ్వరావు తదితరులు కలిసి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

📍వీరు GDCC బ్యాంక్ నియమ నిబంధనలు మరియు కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకింగ్ నియమాలను ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల బ్యాంకుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు నిర్ధారణ అయింది. ఈ అవకతవకలపై గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివిజినల్ కో-ఆపరేటివ్ సొసైటీ, తెనాలి వారు విచారణ చేపట్టి, అనంతరం డివిజినల్ కో-ఆపరేటివ్ అధికారి శ్రీ కె. శీనా రెడ్డి గారు ఫిర్యాదు చేయగా, నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో

Cr. No.1281/2025 U/S 120(B), 420, 409 r/w 34 IPC కింద కేసు నమోదు చేయబడింది.

దర్యాప్తు వివరాలు: గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును CCS డీఎస్పీ శ్రీ బి.వి. మధుసూదనరావు గారికి అప్పగించగా, వారు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, A-8 నిందితుడు పీటా వెంకటేశ్వరావు పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అతని కదలికలపై నిఘా ఉంచి, అరెస్ట్ చేయడం జరిగింది.

A-8 నిందితుని వివరాలు: పీటా వెంకటేశ్వరావు,S/o కృష్ణమూర్తి, 62 సం.లు, గాయత్రి ఎవెన్యూ అపార్ట్మెంటు, పటేల్ నగర్ 2వ లైన్, బాపట్ల టౌన్.

ఇతడు నల్లపాడు GDCC బ్యాంక్ పాలకవర్గంలోని ఏడుగురు సభ్యుల కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేయబడినాడు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి గారు 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని CCS డీఎస్పీ శ్రీ బి.వి. మధుసూదనరావు గారు పేర్కొన్నారు..

Search
Categories
Read More
Rajasthan
Title Rajasthan Farmers Shift To Bajra Amid Monsoon Risks
Faced with highly unpredictable and uneven monsoon forecasts, farmers across western Rajasthan...
By Lokeshwari Panthadi 2026-06-27 06:18:33 0 72
Andhra Pradesh
పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం...
By Kothuru Murali 2026-02-17 08:36:08 0 161
SURAKSHA
Guardian of the Coast: Puducherry’s Maritime Security
Puducherry’s strategic coastal geography necessitates a vigilant approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 08:30:03 0 57
Andhra Pradesh
Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్‌ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.
రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు...
By Pagadala Venkateswar 2026-07-22 11:30:47 0 26
Telangana
అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు...
వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి...
By Krishna Balina 2026-03-28 14:30:17 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com