గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!

0
46

బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన....

భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం

ఖానాపురం మండలంలో గొర్రె పిల్లని కాపాడబోయి ఓ బాలుడు ప్రాణాలు...కోల్పోయిన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో జరిగింది. పులిగిల్ల మల్లేష్ - మానస కొడుకు పులిగిల్ల రాఘవ (11) 5 వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంట్లో గొర్రె పిల్లలను మేపడా నికి పొలాల వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ గొర్రె పిల్ల మేత మేస్తూ బావి దగ్గరకు వెళ్లింది. గొర్రె పిల్ల బావిలో పడుతుందని బాలుడు గమనించి కాపాడబోయి బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు బావిలో వెతకగా బాలుడు ఆచూకీ చిక్కలేదు. సాయంత్రం 4 గంటల వరకు బావిలో వెతికి నీటిని తోడగా మృతదేహం లభ్యమైంది. ముక్కుపచ్చలారని బాలుడు మృతి రంగాపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Search
Categories
Read More
Telangana
కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి
 హైదరాబాద్:   - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ. - తమిళనాడులోని...
By Sidhu Maroju 2025-09-28 14:13:36 0 246
Telangana
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు లు
నేడు మెదక్ ఉమ్మడి  జిల్లాలో జరా సంఘం మండల్ పరిధి గ్రామంలో  జొన్న మొక్కజొన్న మరియు ఇతర...
By Alige Srinivas 2026-03-17 13:10:41 0 301
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
By Kothuru Murali 2026-02-06 09:40:56 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com