తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు.

0
54

30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు

తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు 

నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీపి కబురు అందించింది. రాబోయే వారం రోజుల పాటు (జూన్ 30 వరకు) రెండు రాష్ట్రాలలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఈ కాలంలో అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ విస్తారమైన వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది.

 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో కూడిన ఉత్తర కోస్తా ప్రాంతాలలో నేడు (24న) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29, 30 తేదీలలో ఇక్కడ వర్షాల తీవ్రత మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వంటి దక్షిణ కోస్తా జిల్లాలలో ప్రారంభంలో మోస్తరు వర్షాలు ఉండి, జూన్ 28 నుండి 30 మధ్య విస్తారంగా భారీ వర్షాలు కురిసే వీలుంది. రాయలసీమ ప్రాంతంలో ఆరంభంలో తక్కువగా ఉన్నప్పటికీ, వారం చివర్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు (24న) ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వారం చివరి నాటికి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ వర్షాలు విస్తరించనున్నాయి. 

Search
Categories
Read More
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 232
Telangana
రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-03-15 09:53:33 0 151
Andhra Pradesh
మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు...
By Pagadala Venkateswar 2026-03-24 03:28:09 0 183
Andhra Pradesh
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక   * గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
By Rajini Kumari 2026-01-02 12:39:06 0 219
Andhra Pradesh
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
By Pagadala Venkateswar 2026-06-13 10:45:47 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com