హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!

0
140

హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో రెండో దశ విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రెండో దశలోని ఏడు మార్గాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. పీపీపీ మోడల్‌పై కేంద్రం గతంలో లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ప్రాజెక్టు ప్రభుత్వ పరమవడంతో పరిష్కారమైనట్లు రాష్ట్రం భావిస్తోంది.

‎హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ సంస్థకు ఉన్న వంద శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ.. రెండో దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

‎గతంలో మెట్రో రెండో దశ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి దశ పీపీపీ యాజమాన్యంలో, రెండో దశ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం వల్ల ఆపరేషన్ పరంగా సమన్వయ లోపం వచ్చే అవకాశం ఉందని కేంద్రం మెలిక పెట్టింది. ఇప్పుడు మొదటి దశ కూడా ప్రభుత్వ పరమవడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో రెండో దశ ఎ, బి భాగాల్లోని ఏడు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తక్షణమే

‎ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది

Search
Categories
Read More
Business & Finance
ITR Filing Services Ensure Timely Tax Compliance
Filing your Income Tax Return (ITR) on time is essential for staying compliant with tax...
By Navya Sree 2026-07-14 07:29:08 0 58
Andhra Pradesh
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
By Kothuru Murali 2026-04-29 11:18:38 0 163
Telangana
నిజామాబాద్
ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి  మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్...
By Sadaq Sadaq 2026-06-16 05:54:59 0 111
SURAKSHA
Vision in Governance: The Inspiring Journey of IAS Nishant Kumar Yadav
Excellence in Public Administration: How IAS Nishant Kumar Yadav is Redefining Governance :...
By Kalaga Sailaja 2026-07-22 12:17:16 0 32
Andhra Pradesh
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన...
By Boiena Rajesh 2026-06-18 05:28:51 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com