ఈస్ట్ మారేడ్పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు.
కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్తో పాటు అధ్యాపక బృందం విద్యాసంస్థ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది.
కళాశాలకు బోర్వెల్ ఏర్పాటు చేయడం, ప్రహరీ గోడ ఎత్తు పెంచడం, అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడం, ప్రాంగణ సుందరీకరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
నాణ్యమైన సాంకేతిక విద్య ద్వారా యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్ది రేపటి ఇంజనీర్లుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. యువత భవిష్యత్తును బంగారుమయం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, వారి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
#Sidhumaroju
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz