ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|

2
1K

సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు.

కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్‌తో పాటు అధ్యాపక బృందం విద్యాసంస్థ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది.

కళాశాలకు బోర్‌వెల్ ఏర్పాటు చేయడం, ప్రహరీ గోడ ఎత్తు పెంచడం, అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడం, ప్రాంగణ సుందరీకరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

నాణ్యమైన సాంకేతిక విద్య ద్వారా యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్ది రేపటి ఇంజనీర్లుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. యువత భవిష్యత్తును బంగారుమయం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, వారి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Karnataka
Water Resource Management and Conservation in Karnataka
Karnataka is strengthening water resource management and conservation efforts to address growing...
By Fathima Safa 2026-06-17 06:38:24 0 94
Andhra Pradesh
కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి...
By Pagadala Venkateswar 2026-02-03 06:17:29 0 143
Business & Finance
GST Registration for Foreign Businesses in India
GST Registration for Foreign Businesses is mandatory for non-resident taxable persons (NRTPs)...
By Navya Sree 2026-07-21 07:06:43 0 43
Andhra Pradesh
మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.
మదనపల్లె అమ్మచెరువుమిట్టలో ఇంటి స్థలం వివాదం రమణమ్మ, నారాయణమ్మ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు...
By Pagadala Venkateswar 2026-03-07 05:00:29 0 167
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.
  పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం  Andhra Mrithyunjaya Homam on April...
By Pagadala Venkateswar 2026-04-21 03:34:11 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com