చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు నిలిచిపోయాయి: సీపీఐ(ఎం) ఆరోపణ!

0
127

చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి  పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. "ఈ ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, అవసరమైన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది," అని వెంకట్ అన్నారు. "అనస్థీషియా డాక్టర్ లేకపోవడం వల్ల, గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు లేదా ఇతర నగరాలకు వెళ్లవలసి వస్తుంది, ఇది వారికి అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. "సురేష్ మాట్లాడుతూ, "చింతూరు మరియు పరిసర గ్రామాలకు ఈ ఆసుపత్రి కీలకమైనది. ఇక్కడ ప్రసవ సేవలు నిలిచిపోవడం వల్ల పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని తెలిపారు. "ప్రభుత్వం వెంటనే స్పందిించి అనస్థీషియా డాక్టర్ ను నియమించాలని, లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాము," అని వారు హెచ్చరించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:00 0 117
Andhra Pradesh
నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన...
By Patan Khuddus 2026-05-03 13:05:30 0 293
Andhra Pradesh
బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు
14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:34:28 0 354
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 163
Telangana
సంక్రాంతి పండక్కి వస్తున్నాం.|
సికింద్రాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా...
By Sidhu Maroju 2026-01-10 12:57:55 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com