తనిఖీలు చేస్తున్న ఆర్టీవో పై నుంచి వెళ్లిన బొగ్గు లారీ.....

0
131

అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన అధికారి

ఆర్టీవో కార్యాలయం ముందే బీభత్సం సృష్టించిన బొగ్గు లారీ...

భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు బొగ్గు లారీలను చెక్ చేస్తున్న క్రమంలో అతివేగంతో వచ్చిన ఒక టిప్పర్ లారీ ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆర్టీవో వెంకన్న స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు...

బదిలీపై వచ్చిన నెల రోజులకే ప్రమాదం

ఆర్టీవో వెంకన్న కేవలం నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై బాధ్యతలు చేపట్టడానికి వచ్చారని తోటి అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కార్యాలయం ముందే తనిఖీలు చేపడుతుండగా ఈ ఘోర ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీ బీభత్సంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Bihar
Bihar Police Record 11% Rise in Illegal Liquor Seizures
The Bihar Police have reported a significant 11% surge in liquor seizures across the state during...
By Tejaswini Komanduru 2026-06-16 04:37:15 0 169
SURAKSHA
Prem Krishnan, IAS: A Visionary Driving Transformative Governance
The Journey begins "Good governance is not measured by the power of authority but by the...
By Fathima Safa 2026-07-15 04:38:03 0 61
Telangana
అధికారంలోకి వస్తున్నాం ‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు ‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో  ‎TRS మళ్ళీ పుట్టింది  ‎తెలంగాణ రాష్ట్ర సేన  ‎కవిత కొత్త...
By Ponnala Srinivasrao 2026-04-25 08:44:46 0 105
Telangana
"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన...
By Sidhu Maroju 2026-06-15 13:30:26 0 92
Andhra Pradesh
దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ను ముట్టుకోరు ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్
🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ...
By Rajini Kumari 2026-01-10 13:18:49 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com