మన ఊరి మాట మంతి కార్యక్రమం

0
71

కాకినాడ మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో శ్రీ Pawan Kalyan గారి ప్రసంగం

 

• సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్‌గా మాత్రమే చూడాలి. వారికి కులాలను అంటగట్టడం సరికాదు. 

• ⁠ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే కులాల దరిద్రం వదిలిపోవాలి

• ⁠నేరం చేసిన వాళ్ళకి కులం ఏమిటి 

• నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పాలకులుగా మారడానికి వీల్లేదు. క్రిమినల్స్ పాలకులైతే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుంది.

• ⁠ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి. అతను డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎవరికీ కులం గుర్తుకురాదు. ఇప్పుడు నేరస్థులపై చర్యలు తీసుకుంటుంటే మాత్రం గుర్తొస్తుంది.

• ⁠రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తూ, తప్పులకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది.

• ⁠కూటమి పాలనలో ఎవరైనా తప్పు చేసి దొరికితే, వారు తమ జీవితంలో మళ్లీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచన కూడా చేయలేనంత తీవ్రంగా చర్యలు ఉంటాయి.

• తప్పు చేసే వాడికే కులం ఉంటుందా బాధితురాలుకి కులం ఉండదా. 

• ⁠పాపం చిన్న వయసులో 23 నేరాలు చేశాడు,

పాపం పసి వయసులో బీరు బాటిల్ తీసుకుని గొంతు కోసేశాడు..తెలిసి తెలియని పసి వయసు అని సమర్థించే వ్యక్తులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.

• ⁠ఇదే పెద్దమనిషి తెలంగాణ ప్రభుత్వం దిశ కేసులో చేస్తే అద్భుతంగా చేశారని అంటారు. ఏపీకి వచ్చేసరికి కులం పేరు ఎత్తుతాడు.

• వైసీపీ రౌడీ మూకలకి చెబుతున్నా పిచ్చి వేషాలు వేస్తే క్షమించే పరిస్థితి ఇక్కడ లేదు. పొరపాటున మీ ప్రభుత్వం వచ్చినా సరే తొక్కి నారతీస్తా.

• గతంలో వైసీపీకి సంబంధించిన మూలాలు ఉన్న పోలీసులపై ప్రత్యేకంగా దృష్టి పెడతా. ఒక స్టేషన్ ఎస్సై స్థాయిలో జరగాల్సిన న్యాయం ఎస్పీ డిప్యూటీ సీఎం వరకు రావడం వ్యవస్థలో లోపాలకు అద్దం పడుతోంది.

• తప్పు చేసిన వాడికి, నేరాలకు పాల్పడేవారికి ఎలాంటి కులం, మతం ఉండవు. 

• ⁠సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అటువంటి నీచమైన శక్తులను ఏ ఒక్కరూ సమర్థించకూడదు. వెనకేసుకు రాకూడదు.

• క్రిమినల్ గ్యాంగ్‌ల సహాయంతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం.

• నేరపూరిత నేపథ్యం ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులను అధిష్టించి, ప్రజల జీవితాలను శాసించాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. అటువంటి శక్తులపై నిరంతరం తిరగబడటానికి, న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటాం. క్రిమినల్స్ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు మంటగలుస్తుంది.

• కాకినాడలోని చిన్నస్వామి నగర్ లో గతంలో ప్రభుత్వం 63 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చింది. అందులో వింతతువులు, దివ్యాంగులు, క్యాన్సర్ బాధితుల పట్టాలను వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తీసుకొని వేరే పేరు మీదకు మార్చేశారు. మార్వాడి కుటుంబానికి చెందిన ఆస్తులను ఆక్రమించుకున్నారు. వాళ్లు వైసీసీ వాళ్ల టార్చర్ తట్టుకోలేక కాకినాడ వదిలేసి వెళ్లిపోయారు. సివిల్ సొసైటి బలంగా ఉంటే ఇలాంటి క్రిమినల్ రాజ్యాలు ఏలవు. పూర్తిగా భవిష్యత్తు మీ చేతులో ఉంది. 

• గతంలో కోనసీమలో జరిగింది. రికరింగ్ పేట్రన్, రిపీటెడ్ బిహేవియర్. పోలీసులకు నేను చెప్పేది ఒకటే. ఎవరైనా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ... ఊరుకోవద్దు. వాళ్లు భవిష్యత్తులో వస్తారేమోనన్న భయం వద్దు. దేనికంటే క్రిమినల్స్ ను మేము ప్రోత్సహించం.

• సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇళ్లల్లోకి వస్తామని, ఆడబిడ్డలను వేధిస్తామని బెదిరించే వారిని వదిలిపెట్టేది లేదు.

• మహిళలను, ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. సామాజిక మాధ్యమాల్లో భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు

• గతంలో కోనసీమలో జరిగిన ఘటనలు పునరావృతమయ్యే నేరపూరిత ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. 

• కోనసీమకు అంబేద్కర్ గారి పేరు పెట్టారు. పేరు మీద వ్యతిరేకత ఉంటే చెప్పండి అని ప్రభుత్వం చెప్పింది. ఏకాభిప్రాయం లేదని చెప్పడానికి వెళ్లినప్పుడు.. అంబేద్కర్ పేరు ఇష్టంలేదని చెప్పినవారిని బెదిరింపులకు గురిచేశారు. ఇళ్లలోకి వచ్చి మానభంగాలు చేస్తామని భయపెట్టారు. ఇలా మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఒక్కమాట మాట్లాడలేదు.

• క్రిమినల్స్ కు కులం ఉండదు. చాలా మంది కన్వీనెంట్ రాజకీయాలు చేస్తారు. రౌడీలను ఎంకరేజ్ చేశారా? దేశాన్ని ఎవడు బాగు చేయలేరు. 

• ఒక హోంమంత్రిని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆమె మేకప్ గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో తిరిగే ఆడబిడ్డ అలంకారాలు చేసుకోకూడదా. ఇలాంటి మాటలు ప్రేరణగా తీసుకొని కాలేజీలో కుర్రాడు అప్పుడే వచ్చిన ఆడబిడ్డను అంటాడు. నా భయం అది. దాని పర్యావసానాలు ఊహించలేము. 

• 2017లో సుగాలీ ప్రీతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాటి యాజమాన్యం ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పినప్పటికీ, ఆమెపై అత్యాచారం చేసి చంపేశారనే ఆరోపణలు వచ్చాయి. సుగాలీ ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ దాదాపు లక్షన్నర మందితో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. ఆ ఒత్తిడితోనే కేసును సీబీఐ విచారణకు అప్పగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

• 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేవలం నామమాత్రంగా లేఖ రాసి వదిలేసిందని, కేసును అసలు పట్టించుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. తాము అధికారంలోకి రాగానే మొదటి కేసుగా దీనిపైనే దృష్టి పెట్టాలని భావించాం. అయితే గత ప్రభుత్వం ఈ కేసులోని కీలక సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేసిందని ప్రస్తుత పాలకులు ఆరోపించారు. చట్టం మరియు శాంతిభద్రతలు ఎప్పుడూ సాక్ష్యాధారాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన డీఎన్ఏ నమూనాలను కూడా మాయం చేసి నిందితులను రక్షించే ప్రయత్నం చేశారు.

• వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన సొంత నివాసంలోనే అతి దారుణంగా నరికి చంపారు. ఈ హత్య ఎవరు చేశారనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, కోర్టులో నిరూపించడానికి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉండాలి. చట్టం ముందు సాక్ష్యాలు లేకపోతే ఏమీ చేయలేము. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన అంశం.

- కులాలు మతాల పరంగా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి.

కానీ లా & ఆర్డర్ కోసం, లోకల్ లో ఉన్న సమస్యల కోసం వాట్సాప్ గ్రూపులు ఎందుకు ఉండకూడదు ?

ఆ దిశగా ఆలోచించాలి సమాజం.

- నేను బాధ్యతలు తీసుకున్నాక కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి ఎవరు కలెక్టర్ గా ఉండాలి అనే ఆలోచన చెయ్యలేదు.

ఒక్కటే సూచన ఇచ్చాను ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, వ్యవస్థ బలంగా ఉండాలి.

ఇది తప్పా నా దగ్గర నుండి మీకు ఫోన్లు రావు, నా పార్టీ వారు అయినా నేను ప్రోత్సహించను అని స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను వ్యవస్థలను బలపరచడానికి ఉన్నాను, బలహీన పరచడానికి కాదు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బలమైన నాయకులను జైల్లో పెడుతున్నారు: ఎంపీ
తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-03-17 07:03:36 0 156
Andhra Pradesh
Andhra Pradesh Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల మహిళలు ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండానే ఆర్టిసి బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-01-08 10:50:29 0 517
SURAKSHA
Y. Kikheto Sema: Driving Nagaland's Development Vision
A distinguished IAS officer of the Nagaland cadre, Shri Y. Kikheto Sema serves as the Principal...
By Lokeshwari Panthadi 2026-07-23 06:50:11 0 39
Business & Finance
Assam Budget Session Raises Business Growth Expectations
The Assam government has announced that the Budget Session of the Legislative Assembly will...
By Navya Sree 2026-07-02 05:55:00 0 101
Telangana
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
By Bheeshman King 2026-02-04 13:51:21 0 378
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com