46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.

0
81

📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి 01.02.2026 వరకు నిర్వహించిన 46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో గుంటూరు జిల్లా హోం గార్డ్ జి. కృష్ణ కిషోర్ పాల్గొని గణనీయమైన ప్రతిభను ప్రదర్శించారు.

📍ఈ పోటీలలో 30+ వయో వర్గం – 5 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన 00:32:40.2 సెకన్ల సమయంలో రేస్ పూర్తి చేసి రెండవ స్థానం సాధించి రజత పతకాన్ని గెలుచుకున్నారు.

🚩 ఈ సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారిని హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిసి, తాను పతకం సాధించిన విషయాన్ని ఎస్పీ గారికి తెలుపగా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.

📍భవిష్యత్తులో జరగబోయే పోటీలలో మరిన్ని పతకాలు సాధించి గుంటూరు జిల్లా పేరు ప్రతిష్టలను మరింత ఉన్నతంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌కు గౌరవ ఎస్పీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ ఏ హనుమంతు గారు, హోమ్ గార్డు ఆర్ఐ రామకృష్ణ రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ...
By Prashanth Goindla 2026-02-10 14:57:38 0 182
Andhra Pradesh
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి....
By Boiena Rajesh 2026-03-31 09:13:35 0 90
Andhra Pradesh
గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.
*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!*...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:12:25 0 282
Andhra Pradesh
మదనపల్లిలో మినీ స్టేడియం నిర్మాణ కసరత్తు: ఎమ్మెల్యే.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో, కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం మినీ...
By Pagadala Venkateswar 2026-02-03 06:28:04 0 78
Andhra Pradesh
గుంటూరు నగరపాలక సంస్థ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కె. మయూర్ అశోక్ గారూ ని మర్యాద పూర్వకంగా కలిసిన YK TV NEWS కరస్పాండెంట్.
  <>kvsr. కోటేశ్వరరావు   గుంటూరు నగరపాలక సంస్థ నూతన మున్సిపల్ కమిషనర్ గా...
By KOTESWARARAO KVSR 2026-01-19 17:20:03 0 396
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com