46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.

0
80

📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి 01.02.2026 వరకు నిర్వహించిన 46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో గుంటూరు జిల్లా హోం గార్డ్ జి. కృష్ణ కిషోర్ పాల్గొని గణనీయమైన ప్రతిభను ప్రదర్శించారు.

📍ఈ పోటీలలో 30+ వయో వర్గం – 5 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన 00:32:40.2 సెకన్ల సమయంలో రేస్ పూర్తి చేసి రెండవ స్థానం సాధించి రజత పతకాన్ని గెలుచుకున్నారు.

🚩 ఈ సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారిని హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిసి, తాను పతకం సాధించిన విషయాన్ని ఎస్పీ గారికి తెలుపగా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.

📍భవిష్యత్తులో జరగబోయే పోటీలలో మరిన్ని పతకాలు సాధించి గుంటూరు జిల్లా పేరు ప్రతిష్టలను మరింత ఉన్నతంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌కు గౌరవ ఎస్పీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ ఏ హనుమంతు గారు, హోమ్ గార్డు ఆర్ఐ రామకృష్ణ రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు...
By Pagadala Venkateswar 2026-02-28 06:40:53 0 74
Andhra Pradesh
నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ
🧑‍✈️🧑‍✈️🧑‍✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*....
By Rajini Kumari 2025-12-22 11:14:00 0 154
Andhra Pradesh
పుంగునూరు :పుగునూరు పట్టణం లో పరవళ్ళు తొక్కిన కృష్ణమ్మ
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు...
By Kothuru Murali 2026-02-11 08:50:50 0 90
Andhra Pradesh
దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన
06.03.2026   కూడలి దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న రాజగోపురం...
By Rajini Kumari 2026-03-06 10:59:47 0 108
Andhra Pradesh
మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని...
By Pagadala Venkateswar 2026-02-22 06:35:16 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com