బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నూనె, గ్యాస్ లేకుండా ఆరోగ్యకరమైన వంటల పోటీలు మహిళలను అభినందించిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

0
157

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ భవాని గారి అధ్యక్షతన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలన (సుశాసన్), వికసిత్ భారత్ మరియు జన కళ్యాణ్ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 19వ తేదీన మేడ్చల్ జిల్లాలోని మోతీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో వినూత్నమైన వంటల పోటీలు నిర్వహించారు.

ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిరక్షణ, సహజమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని నూనె మరియు గ్యాస్ వినియోగం లేకుండా ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసే విధంగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు *డా. శిల్పా రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు* పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ మహిళల ప్రతిభ, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మహిళలు కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆరోగ్యకరమైన వంట విధానాలపై అవగాహన పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు.మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మహిళా సాధికారతకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా నిర్వహించాలని సూచించారు.

అనంతరం పోటీలలో విజేతలకు గ్యాస్ వినియోగం లేకుండా వంట చేసుకునేందుకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, కెటిల్స్ తదితర బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ కన్వీనర్ శ్రీకర్ రావు, మోతి నగర్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర స్వామి, మోతి నగర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శోభారాజన్, నాగరాజు, సద్గుణ రెడ్డి, అంజిరెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ మహిళా మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Robin Hibu, IPS: Inspiring Leadership Beyond the Uniform
The Journey Begins When thousands of young people from Northeast India migrate...
By Fathima Safa 2026-07-22 10:42:29 0 29
Telangana
హైదరాబాద్‌లో వివాహిత నాగేశ్వరి అనుమా'నాస్పద అదృ'శ్యం: పోచారం ఐటీ కారిడార్ పోలీసుల దర్యాప్తు
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన నాగేశ్వరి అనే వివాహిత అనుమా'నాస్పద...
By Ponnala Srinivasrao 2026-06-08 12:24:29 0 132
Telangana
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
  సూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్    ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి...
By Vanmoj Suryamohan 2026-05-09 07:59:06 0 217
Andhra Pradesh
శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ
బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన...
By Mobbu Venkatramana 2026-02-18 14:37:20 0 284
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-03-08 08:17:44 0 351
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com