"మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|

0
119

"ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.

సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సమీపంలోని మల్కాజిగిరి జోనల్ కార్యాలయ ఆవరణలో ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ సీ.వి. ఆనంద్ మాట్లాడుతూ, కమిషనరేట్ సేవలను వికేంద్రీకరించడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా పోలీసు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, స్థానిక స్థాయిలోనే సేవలను అందించేలా ఈ క్యాంప్ కార్యాలయం పనిచేస్తుందన్నారు.

మల్కాజిగిరి, ఉప్పల్ జోన్ల పరిధిలోని పోలీసు స్టేషన్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 11 పోలీసు స్టేషన్ల పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడనుంది. 

ఫీల్డ్ స్థాయి అధికారులకు, ఉన్నతాధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంలో వేగం పెంచుతుందని అధికారులు తెలిపారు.

ప్రజా భద్రత, సేవల నిర్వహణలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు ఈ క్యాంప్ కార్యాలయం దోహదపడుతుందని డీజీపీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఐఏఎస్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్, పోలీసు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Maharashtra
Maharashtra RTI Rules Amendment Sparks Outrage
The Maharashtra government's recent notification amending the Right to Information (RTI) Rules...
By Lokeshwari Panthadi 2026-06-27 06:29:01 0 37
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 126
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన...
By Patan Khuddus 2026-04-21 09:02:37 0 284
Andhra Pradesh
అన్నమయ్య: 2 వాహనాలు దగ్ధం.
శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద ముంబై- చెన్నై జాతీయ...
By Pagadala Venkateswar 2026-06-06 05:38:15 0 78
West Bengal
West Bengal Advances Digital Governance and Services
West Bengal has continued to strengthen digital governance and public service delivery through...
By Fathima Safa 2026-06-25 10:08:34 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com