కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ!

0
63

సీఆర్ పాటిల్ తో పవన్ కల్యాణ్ భేటీ

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరలేదని చెప్పిన పవన్

నదీ జలాల స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, కలుషితమవుతున్న నదుల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్ అమలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి కొరత తీరలేదని పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

 

 

 

ప్రజలకు స్థిరమైన తాగునీటి సరఫరా అందించడానికి గుజరాత్‌లోని 'సూరత్ నమూనా'ను అధ్యయనం చేయాలని అధికారులకు పవన్ సూచించారు. సూరత్‌లో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ ఎలా విజయవంతంగా వినియోగిస్తున్నారో, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.

 

 

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామిక కాలుష్యం వల్ల ఏపీలోని నదులు, జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు వదిలే వ్యర్థాల వల్ల నదులు కలుషితం కాకుండా ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 174
Andhra Pradesh
హిందూ సమ్మేళనం ఓదివేడు
ఈరోజు ఓదివీడు హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంబాత్రేయ క్షేత్రం  పీఠాధిపతి ఘనంగా...
By Benguluri Madhubabu 2026-01-14 06:53:51 0 349
Telangana
సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్ అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని ...
By Sidhu Maroju 2025-07-30 16:04:16 1 852
Telangana
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
నస్పూర్ : తేదీ  07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన...
By Avunoori Mahesh 2026-05-07 10:11:54 0 181
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com